MNR గుప్తకు కాకతీయ పురస్కారం
NEWS Mar 15,2025 05:57 pm
హైదరాబాద్: ఇండస్ ఫౌండేషన్ ప్రతిష్ఠాత్మకంగా అందించే కాకతీయ పురస్కారం ఈ సంవత్సరం రిట్జీ గ్రూప్ గ్లోబల్ సీఈఓ స్టార్ ఐకాన్ MNR గుప్తకు లభించింది. యువత, మహిళా సాధికారత, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఇండస్ ఫౌండేషన్ ఛైర్మన్ రాకేశ్ రెడ్డి అనుగుల కాకతీయ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు MNR గుప్తకు శుభాకాంక్షలు తెలిపారు.