భారత్ ఇది మూడో ఛాంపియన్స్ ట్రోఫీ
NEWS Mar 09,2025 04:28 pm
దుబాయ్: భారత్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. కివీస్ 252 పరుగుల టార్గెట్ను భారత్ 49 ఓవర్లలో ఛేదించి, ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను ముద్దాడింది. 12ఏళ్ల తర్వాత భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. భారత్ ఇది మూడో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్. గతంలో 2002, 2013లో భారత్ నెగ్గింది.