గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ ఇక లేరు
NEWS Mar 09,2025 08:04 pm
టీటీడీ ఆస్థాన విధ్వాంసుడు, ప్రముఖ గాయకుడు గరిమళ్ల బాలకృష్ణ ప్రసాద్ గుండె పోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 76 ఏళ్లు. ఆదివారం సాయంత్రం గుండె పోటుతో స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆయన 1000కి పైగా అన్నామాచార్య సంకీర్తనలకు స్వర కల్పన చేశారు. వినరో భాగ్యము విష్ణుకథ, జగడపు చనువుల జాజర, పిడికిట తలండ్రాల పెండ్లికూతురు తదితర కీర్తనలకు ఈయనే స్వరాలు సమకూర్చారు. గరిమెళ్ల మృతి పట్ల తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడుతో పాటు సీఎం చంద్రబాబు, ఈవో శ్యామలరావు, తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.