ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి..విజయశాంతి
NEWS Mar 09,2025 02:08 pm
ఏఐసీసీ కీలక ప్రకటన చేసింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది. ఎవరూ ఊహించని రీతిలో రాములమ్మకు సీటు దక్కడం విశేషం. ఆదివారం పార్టీ హైకమాండ్ ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేసింది. ముందు నుంచి పార్టీ కోసం పని చేస్తూ వచ్చిన పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు అద్దంకి దయాకర్ , తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన, ఎన్నికల ప్రచారంలో ముఖ్య భూమిక పోషించిన విజయశాంతికి, శంకర్ నాయక్ ను అభ్యర్థులుగా ఖరారు చేసింది. ఇంకో సీటును మిత్ర పక్షం సీపీఐకి కేటాయించినట్లు తెలిపింది.