అగ్రిగేటర్ కంపెనీలకు వ్యతిరేకంగా ప్రచారం
NEWS Mar 09,2025 05:07 pm
తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ సంచలన ప్రకటన చేశారు. అగ్రిగేటర్ కంపెనీల అన్యాయమైన పద్ధతులకు వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఓలా, ఉబర్ , రాపిడో ద్వారా నిర్వహించబడుతున్న విమానాశ్రయ ప్రయాణాలను బహిష్కరించాలని ఇప్పటికే పిలుపునిచ్చామని తెలిపారు. ఈ అగ్రిగేటర్ కంపెనీలు విధించే తక్కువ ఛార్జీల సమస్యకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.