కిడ్నీ ఫెయిల్యూర్ బాధితునికి ఆర్థిక సాయం
NEWS Mar 09,2025 05:08 pm
మెట్ పల్లి మండలం చింతలపేటకు చెందిన గంధం రాజేశ్ (30) రెండు కిడ్నీలు ఫెయిలై హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గ్రామస్థులు స్పందించి రూ.65 వేలను బాధితుని భార్యకు అందజేశారు. రాజేశ్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం రాజేశ్ కు డయాలసిస్ చేయాల్సిందిగా వైద్యులు పేర్కొన్నారు. పేద కుటుంబం కావడంతో బాధిత కుటుంబం ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది.