యువత మత్తుకు బానిస కావద్దు
NEWS Mar 09,2025 05:37 pm
యువత మత్తుకు బానిసవుతున్నారని వాటి నుంచి దూరంగా ఉండాలని సూచించారు సీఎస్ రాజ్ కుమార్ . నారాయణఖేడ్ పట్టణంలోని కాశినాథ్ మందిర్ ప్రాంగణం తన కార్యాలయంలో మాట్లాడారు. యువత మత్తుకు బానిసై జీవితాన్ని అంధకారంలోకి నెట్టుకోకూడదని, తల్లిదండ్రులు కన్న కలలు నెరవేర్చాలంటే ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు క్రమశిక్షణతో వింటే భవిష్యత్తుకు భరోసా ఉంటుందన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉంటుందని, కాబోయే తరానికి రాబోయే సంపద యువతది అన్నారు.