ఒంటిమిట్టలో మహా శాంతి అభిషేకం
NEWS Mar 09,2025 12:49 pm
టీటీడీ ఆధ్వర్యంలోని ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో మహా శాంతి అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు చతుస్థానార్చనము, శ్రీమద్రామాయణ యజ్ఞం, మూర్తి హోమం, సహస్ర కలశాది దేవత హోమం, సహస్ర కలశాభిషేకం, పూర్ణాహుతి నిర్వహించారు. కళాపకర్షణ, శయ్యాదివాసం, ప్రధాన మూర్తి హోమం, తత్వన్యాస హోమములు, వేదాది పారాయణం, అష్టబంధన సమర్పణ, శాంతి హోమం, పూర్ణాహుతి, మహా శాంతి అభిషేకం జరిగింది.