వైసీపీ నేతలు ఖూనీలు చేసి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. సొంత ఆస్తులు పెంచుకున్నారే తప్పా ఏనాడూ ప్రజల గురించి ఆలోచించిన పాపాన పోలేదన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అందిస్తామని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ చొరవ వల్లనే ఇవాళ రాష్ట్రంలో రోడ్లకు మహర్దశ పట్టిందన్నారు. జగ్గంపేటలో పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించడం అభినందనీయమన్నారు. వైసీపీ నాయకులు గత ఐదేళ్లు దుర్మార్గంగా పాలించారని ఆవేదన చెందారు.