జాతీయ లోక్ అదాలత్ లు ప్రారంభం
NEWS Mar 09,2025 08:46 am
మొదటి జాతీయ లోక్ అదాలత్ తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి, లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్య నిర్వాహక ఛైర్మన్ సుజోయ్ పాల్ వరంగల్, హన్మకొండ జిల్లాల్లో లోక్ అదాలత్ లను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ మౌషమి భట్టాచార్య వర్చువల్ గా హాజరయ్యారు. జాతీయ లోక్ అదాలత్లో సమస్యలను పరిష్కరించిన లబ్ధిదారులకు తాత్కాలిక న్యాయమూర్తి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎల్ఎస్ఏ సభ్య కార్యదర్శి కూడా పాల్గొన్నారు.