కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలో బీజేపీకి చెందిన కోవర్టులు ఉన్నారంటూ బాంబు పేల్చారు. రెండు రకాల నాయకులు ఉన్నారని, వారిలో ఓ వర్గం ప్రజలకు అండగా నిలుస్తూ వారి పక్షాన సమస్యలపై పోరాటు చేస్తున్నారని అన్నారు. మరో వర్గం నేతలు ప్రజలకు దూరంగా ఉంటూ బీజేపీతో దోస్తానా చేస్తూ పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. తమ పార్టీలో ఉన్న ఆ నేతలు ఎవరో తమకు తెలుసన్నారు. వారిని గుర్తించి బయటకు పంపించే ప్రక్రియ త్వరలోనే కొనసాగుతుందని స్పష్టం చేశారు .