ఇస్తా రెస్టారెంట్ పై మున్సిపల్ అధికారుల తనిఖీలు
NEWS Mar 08,2025 08:35 pm
కోరుట్ల పట్టణంలోని ఇస్తా రెస్టారెంట్పై పట్టణ ప్రజల ఫిర్యాదుల మేరకు మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు. నిల్వ ఉన్న ఆహార పదార్థాలను స్వాధీన పరచుకొని వాళ్లు ఉపయోగిస్తున్న వంట నూనె, వంట గదిని పరిశీలించి రూ.10,000 జరిమానా విధించారు. ఈ దాడుల్లో మున్సిపల్ మేనేజర్ క్రాంతి కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ బాలే అశోక్, ఇతర సిబ్బంది ఉన్నారు.