జాతీయ లోక్ అదాలత్ కు భారీ స్పందన
NEWS Mar 08,2025 06:00 pm
జహీరాబాద్ మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం జహీరాబాద్ కోర్టు కాంప్లెక్స్ లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. సీనియర్ కోర్ట్, జూనియర్ కోర్ట్ విభాగలలో మొత్తం 321 కేసులు పరిష్కారం అయ్యాయి. వీటి ద్వారా 86 లక్షల 40 వేల 8 వందల 35 రూపాయలు వసూలు అయ్యాయని మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి కె. సూరికృష్ణ తెలిపారు.