33 వ వార్డులో మహిళా దినోత్సవ వేడుకలు
NEWS Mar 08,2025 06:02 pm
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జటాయు కాస్మెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మమత లక్ష్మణ్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మమత పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి చీరలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కారుకురి రామచందర్, బండి ప్రభాకర్, చిప్ప మనోహర్ , గాలి శ్రీనివాస్ , దాసరి ప్రతాప్ , మేకల శ్రీనివాస్ , జక్కుల శ్వేత, పోలు ఉమాదేవి, శ్రీనువాసు, ఆర్పీ అరుణ , ఏఎన్ఎంలు ,మహిళలు తదితరులు పాల్గొన్నారు .