సింహాచలం భూముల విషయంలో ప్రభుత్వం పరిష్కారం దిశగా అడుగులు వేసిందన్నారు టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాస రావు. 12 వేల 149 కుటుంబాలకు న్యాయం చేయాలి అనే ఆలోచన గత ప్రభుత్వానికి లేకపోవటం శోచనీయమన్నారు. కానీ ఈ ప్రభుత్వం 420 ఎకరాలకు గాను 610 ఎకరాలు ఇచ్చేందుకు సిద్ధపడిందని చెప్పారు. దేవస్థానంకు సంబంధించి భూములను అడ్డగోలుగా దోచుకునేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించారు. తాము వచ్చాక విచారణ ప్రారంభించామన్నారు.