ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మ వారి ఆలయ అభివృద్దికి సరికొత్తగా మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు ఎమ్మెల్యే సుజనా చౌదరి. ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు అమ్మ వారిని దర్శించుకునేందుకు వస్తుంటారని, ఏ ఒక్క భక్తుడు ఇబ్బంది పడకుండా వసతి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఆలయాల అభివృద్ది కోసం చర్యలు తీసుకుందన్నారు. ఈ మేరకు బడ్జెట్ లో నిధులు కేటాయించామన్నారు.