ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభ మేళాలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై స్పందించారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా (పరిహారం ) ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మౌని అమవాస్య కావడంతో త్రివేణి సంగమాల ఘాట్ లలో పుణ్య స్నానాలు చేసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు.