ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమించింది ప్రభుత్వం. పూర్తిగా అదనపు బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయ్ కుమార్ వెల్లడించారు. కాగా ఈ నెలాఖరులో ప్రస్తుతం డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ద్వారకా తిరుమల రావు పదవీ విరమణ చేయనున్నారు. దీంతో హరీష్ కుమార్ గుప్తాకే ప్రయారిటీ ఇచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.