సీపీఐ(ఎం) రాష్ట్ర నాలుగవ మహాసభలు ఈనెల 25 నుండి 28వ తేదీ వరకు సంగారెడ్డి పట్టణంలో జరిగాయి. ఈ మహాసభల్లో భాగంగా నూతన రాష్ట్ర కమిటీని రాష్ట్ర మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మహాసభల్లో నిజామాబాద్ జిల్లా నుండి పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు, కార్మిక సంఘం నాయకురాలు నూర్జహాన్ ను రాష్ట్ర కమిటీ ఆహ్వానితురాలుగా ఎన్నుకున్నారు. మహాసభ నిర్ణయాలలో భాగంగా జిల్లాలో మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా, పోరాటంతో పాటు సామాజిక ఉద్యమాలను, కార్మిక ఉద్యమాలు చేస్తామన్నారు.