బ్రహ్మర్షి చాగంటి కోటేశ్వర రావుకు అవమానం జరిగిందంటూ ప్రచారం చేసిన సోషల్ మీడియా ప్రతినిధులపై తిరుపతి యూనివర్శిటీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది టీటీడీ.హైదరాబాద్ కేంద్రంగా ఉన్న డయల్ న్యూస్, పోస్ట్ 360, జర్నలిస్ట్ వైఎన్ఆర్ నిర్వాహకులపై కేసు నమోదైంది. ఎలాంటి అవమానం జరగలేదని వివరణ ఇచ్చినా కావాలని దుష్ప్రచారం చేశారని ఈవో శ్యామల రావు తెలిపారు. న్యూఢిల్లీ, విజయవాడలో ఉన్న ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకు ఫిర్యాదు చేశామన్నారు.