ఇస్రో వందో ప్రయోగం శ్రీహరికోట వేదికగా జరిగింది. శాస్త్రవేత్తలు షార్ నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్ను ప్రయోగించారు. ఈ రాకెట్ ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని తీసుకొని నింగిలోకి దూసుకెళ్లింది. ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు స్వయంగా అభివృద్ది చేశారు. దీని బరువు 2,250కిలోలు. ఇది కొత్తతరం నావిగేషన్ ఉపగ్రహాల్లో రెండోది కావడం విశేషం. ఇస్రో చీఫ్ వి.నారాయణన్ను అభినందించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.