ప్రయాగ్ రాజ్ లో కొనసాగుతున్న మహా కుంభ మేళాలో మౌని అమవాస్య సందర్బంగా పెద్ద ఎత్తున తొక్కిసలాట చోటు చేసుకుంది. భక్తులు పుణ్య స్నానాలు చేసేందుకు భారీ ఎత్తున తరలి వచ్చారు. దీంతో ఏర్పాటు చేసిన బారికేడ్లు విరిగి పడడంతో ఒక్కసారిగా ఒకరిపై మరొకరు పడ్డారు. చాలా మంది ఊపిరి ఆడక స్పృహ తప్పి పడి పోయారు. దీనిపై స్పందించారు అఖిల్ భారతీయ అఖార పరిషత్ చీఫ్ మహంత్ రవీంద్ర పురి. ఘటన జరగడం బాధాకరమని, అమృత స్నానం రద్దు చేసుకున్నామని ప్రకటించారు.