ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభ మేళాలో తొక్కిసలాట చోటు చేసుకుంది. మౌని అమవాస్య సందర్బంగా పుణ్య స్నానాలు చేసేందుకు భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు. భక్తుల తాకిడికి ఏర్పాటు చేసిన బారికేడ్లు విరిగి పడడంతో ఒకరిపై మరొకరు పడ్డారు. ఈ ఘటనలో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన సిబ్బంది బాధితులను అంబులెన్సుల్లో ఆస్పత్రులకు తరలించారు.