బౌద్ధ మహాసభను విజయవంతం చేయాలి
NEWS Jan 28,2025 01:10 pm
మెట్ పల్లి బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా, నవయాన్ బుద్ధిస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2న నిర్వహించే బౌద్ధ మహాసభను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి బుద్ధిస్ట్ సభ్యులు సభకు రావాలని కోరుతూ మంగళవారం అంబేద్కర్ పార్కులో కరపత్రాన్ని ఆవిష్కరించారు. బౌద్ధ గురువులు సత్య బోధి, నాగ్ దమ్మ రక్షక్, బుద్ధా రతన్, నరేందర్, రఘు, సురేందర్, సాగర్, అశోక్ తదితరులున్నారు.