క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహద పడతాయని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. మంగళవారం లక్కిరెడ్డి పల్లెలో నిర్వహించిన మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు క్రీడలలో పాల్గొని తమ శరీర ధారుడ్యాన్ని పెంపొందించు కోవాలని అన్నారు. టోర్నమెంట్ మొదటి బహుమతిగా రూ. 25000, రెండవ బహుమతి రూ. 15000, మూడవ బహుమతి రూ. 7000 ప్రకటించారు.