బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. సెక్షన్ 316 BNS ప్రకారం నేరపూరిత నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని ఆరోపించారు. డిసెంబర్ 6, 2023న తాను చేసిన ప్రమాణ స్వీకారాన్ని సీఎం ఉల్లంఘించారని, రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాన్ని పాలిస్తానని హామీ ఇచ్చారని, కానీ దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఫార్ములా ఇ ఒప్పందం రద్దు చేయడం వల్ల రాష్ట్రం రూ. 53 కోట్లను కోల్పోయిందన్నారు. వేలాది జాబ్స్ కల్పించే ఇ మొబిలిటీ వ్యాలీని కోల్పోయిందన్నారు.