మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. మంగళవారం మత్స్యశాఖ ఆధ్వర్యంలో గాలివీడు మండలం వెలుగల్లు ప్రాజెక్టులో 4.80 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు మత్స్యకారుల అభివృద్ధికి సబ్సిడీపై వలలు, బోట్లు, ఐస్ బాక్సులు మోటార్ సైకిల్ ఇచ్చి ఆదుకోవడం జరుగుతోందన్నారు.