కడప డీఈవో షేక్ శంషావుద్దీన్ మంగళవారం రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని చిన్నమండెం మండలం బోరెడ్డి గారి పల్లిలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మడ్డిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అధిక నిధులు ఖర్చు చేస్తోందని, విద్యా శాఖ అధికారులు విద్యాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.