సంబేపల్లి తహసిల్దార్ గా 27వ తేదీ బాధ్యతలు స్వీకరించిన సుబ్రహ్మణ్యం రెడ్డి మంగళవారం చిన్న మండెం మండలం బోరెడ్డిగారి పల్లెలో మంత్రి నివాసం నందు పూల బొకే అందజేసి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి మాట్లాడుతూ సంబేపల్లి మండలంలో రెవిన్యూ సిబ్బంది భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మండలంలో శాశ్విత భూ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు.