చిన్న మండెం మండలం నాగిరెడ్డిగారి పల్లెలో 32 లక్షలతో మంజూరైన సిసి రోడ్డు నిర్మాణానికి మంగళవారం మంత్రి రాంప్రసాద్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. నూతన బోరును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాయచోటి నియోజకవర్గం లోని ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు వేయడం జరుగుతుందన్నారు. కాంట్రాక్టర్లు సిమెంటు రోడ్ల నిర్మాణాలను నాణ్యతతో నిర్దేశించిన గడువు లోపల పూర్తి చేయాలని సూచించారు.