ఈనెల 31 వ తేదిన పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని పెనుగొండనందలి శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు రాష్ట్ర ఆర్య, వైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేశ్. ఈ సందర్బంగా అమ్మ వారి ఆత్మార్పణ దినోత్సవాన్ని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. కుల, మత, ప్రాంతీయాలకు అతీతంగా ఈ వేడుకలు జరపాలన్నారు.