కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఎంఆర్ఆర్ గ్రాంట్స్ లో బీటి రోడ్స్ పునర్నిర్మాణం, మరమ్మతుల కోరకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కృషితో నిధులు విడుదల అయ్యాయి. నియోజవర్గ అభివృద్ధి కొరకు తక్షణమే 4 కోట్ల 32 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. క్యాసంపల్లి-క్యాసంపల్లి తాండ వరకు 76 లక్షలు, PWD రోడ్ నుండి అడ్లూర్ హరిజనవాడ వరకు 1 కోటీ 33 లక్షలు, రాజంపేట -పెద్దయిపల్లి వరకు కోటి 25 లక్షలు నేషనల్ హైవే 7 నుండి టేక్రియల్ వరకు 30 లక్షలు మంజూరు చేశారు.