జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. తమిళనాడులోని 16 ప్రదేశాలలో ఏక కాలంలో దాడులు చేపట్టింది. ఐసిస్ తీవ్రవాదం కేసుకు సంబంధించి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే తనిఖీలు కొనసాగుతుండడంతో ఆయా ప్రాంతాలలోని స్థానికులు అలర్ట్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఎన్ఐఏ బృందాలకు సహకారం అందిస్తోంది. ఈ దాడులకు సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.