మున్నూరు కాపు రైతు సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఎలిశెట్టి గంగారెడ్డి తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. వారి కుటుంబాన్ని టీపీసీసీ డెలిగేట్ సభ్యులు కల్వకుంట్ల సుజిత్ రావు పరామర్శించారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కూన గోవర్ధన్, రాష్ట్ర కిసాన్ సెల్ జాయింట్ కోఆర్డినేటర్ వాకిటి సత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.