బెల్లంపల్లి విద్యార్థికి హైదారాబాద్ సీఓఈ లో ఉత్తమ విద్యార్థి అవార్డు...
NEWS Jan 27,2025 05:58 pm
హైదరాబాద్లోని షేక్పేటలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ప్రీమియర్ లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న బెల్లంపల్లికి చెందిన విద్యార్థి ప్రథమ్ పాండే, విద్య, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను 26 జనవరి76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ విద్యార్థి అవార్డును ప్రధాన ఉపాధ్యాయుడు బాలస్వామి చేతుల మీదుగా అందుకున్నాడు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయుడు గురువారెడ్డి, హౌస్ మాస్టర్ ఇస్మాయిల్ మహ్మద్, బాలకృష్ణ, బాలరాజు తదితరులు పాల్గొన్నారు..