కన్నుల పండువగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం
NEWS Jan 27,2025 05:42 pm
బెల్లంపల్లి మండలంలోని కన్నాలశ్రీబుగ్గ రాజరాజేశ్వర స్వామిదేవాలయంలో ఆలయ చైర్మన్ మాసాడి శ్రీదేవిశ్రీరాములు ఆధ్వర్యంలోశివపార్వతుల కళ్యాణ మహోత్సవంఅర్చకులుశ్రీరాంభట్ల వేణుగోపాల శాస్త్రి,సతీష్లు అంగరంగ వైభవంగా నిర్వహించారు. శివపార్వతుల కళ్యాణ మహోత్సవం తిలకించడానికి బెల్లంపల్లి శ్రీకోదండ రామాలయం,భక్త మార్కండేయ ఆలయం,శ్రీ వాసవిమాత ఆలయాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కళ్యాణ మహోత్సవంకు మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జక్కులశ్వేత తదితరులు హాజరయ్యారు.