కాంగ్రెస్ ప్రభుత్వం కొందరికే రైతు బంధు విడుదల చేసింది. తెలంగాణలో మొత్తం 12 వేల 774 గ్రామాలు ఉండగా మండలానికి ఒక గ్రామం చొప్పున కేవలం 577 గ్రామాలకు మాత్రమే రూ. 560 కోట్ల నిధులను విడుదల చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన చేసినా ఫలితం లేకుండా పోయింది. దీనిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి తమను మోసం చేశారంటూ వాపోతున్నారు.