ఆమ్ ఆద్మీ పార్టీ మేనిఫెస్టో రిలీజ్
NEWS Jan 27,2025 11:08 am
ఢిల్లీ ఎన్నికల సందర్బంగా ఆప్ మేనిఫెస్టోను విడుదల చేసింది. నిరుద్యోగులు లేని రాజధానిగా ఢిల్లీని మారుస్తామని ప్రకటించింది. అధికారంలోకి రాగానే యువతకు ఉద్యోగాలు ఇస్తామని, మహిళా సమ్మాన్ యోజన పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు రూ. 2100 ఇస్తామని పేర్కొంది. సంజీవని పథకం కింద 60 ఏళ్లు నిండిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తామని, నీటి బిల్లులు మాఫీ చేస్తామని, యూరప్ తరహాలో రోడ్లు నిర్మిస్తామని, విద్యార్థులకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తామని ప్రకటించింది.