ఇందూర్ భక్త బృందం కమిటీ ఆధ్వర్యంలో వినాయక నగర్ బస్వ గార్డెన్లో గత ఏడు రోజులుగా బ్రహ్మ శ్రీ ఫణతుల మేఘరాజ్ శర్మ ఆధ్వర్యంలో శ్రీ శివ పురాణ ప్రవచనం నిర్వహిస్తున్నారు. చివరి రోజు శివపా ర్వాతుల కళ్యాణన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ హాజరై మాట్లాడారు. దాంపత్య జీవనానికి శివ పార్వతులు ఆదర్శమని అన్నారు. హిందూ సంస్కృతిని ప్రతి ఒక్కరు కాపాడాలని పిలుపునిచ్చారు.