ఎల్లారెడ్డి అరణ్య అర్బన్ పార్క్ పనులకు శంకుస్థాపన
NEWS Jan 27,2025 10:49 am
ఎల్లారెడ్డి పట్టణానికీ సమీపంలో లింగారెడ్డిపేట ఫారెస్ట్ బ్లాక్ లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న అరణ్య అర్బన్ పార్క్ పనులను ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు శంకుస్థాపన చేశారు. అర్బన్ పార్క్ ప్రతిపాదిత స్థలంలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన వన్య ప్రాణుల అటవీ ఉత్పత్తుల స్టాల్స్ ను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను జంతు, ప్రకృతి ప్రేమికుడినని అడవులను కాపాడాలన్నారు.