మెట్ పల్లి పట్టణంలోని సాయిరాంనగర్ కాలనీలోని ఉప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న వాణిరెడ్డికి ప్రశంసా పత్రం లభించింది. విధుల్లో ఉత్తమ సేవలు అందించినందుకు కలెక్టర్ సత్య ప్రసాద్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా జగిత్యాలలో గణతంత్ర వేడుకలలో ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను పలువురు అభినందించారు.