నిజామాబాద్ నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కార్పొరేషన్ పాలక వర్గం పదవీ కాలం నిన్నటితో పూర్తి కావడంతో జిల్లా కలెక్టర్ ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కలెక్టర్ నిజామాబాద్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఇతర అధికారులు కలెక్టర్ కు పుష్ప గుచ్చాలు అందించి అభినందించారు.