బాన్సువాడ మండలం నాగారం గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు, రైతు భరోసా లబ్ధిదారులకు రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు పత్రాలు అందజేశారు. నిజమైన పేదవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో పేదలకు రేషన్ కార్డులు అందివ్వలేదన్నారు. పథకాల అమలు విషయంలో రేవంత్ సర్కార్ సిద్ధంగా ఉందన్నారు.