బిజెపి జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే లక్ష్మణ్ ను జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ నియామకానికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పసుపు బోర్డు అభివృద్ధికి దోహదం చేయాలనీ బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్ కోరారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల బీజేపీ జిల్లా అధ్యక్షుడు పైడిపల్లి సత్యనారాయణ రావు పాల్గొన్నారు.