మున్సిపాలిటీలో ప్రత్యేక అధికారుల నియామాకం
NEWS Jan 27,2025 04:54 am
నిజామాబాద్ జిల్లా పరిధిలో మూడు మున్సిపాలిటీలు, ఒక్క కార్పొరేషన్ల పాలక వర్గాల పదవీ కాలం ముగియడంతో ప్రత్యేకాధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీలకు ప్రత్యేకాధికారిగా అదనపు కలెక్టర్ (లోకల్బాడీ) అంకిత్ను నియమించగా, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతును ప్రత్యేకాధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి వచ్చింది.