శ్రీవారి భక్తులకు విశిష్ట సేవలు అందించిన టీటీడీ ఉద్యోగులను ప్రశంసించారు ఈవో జె. శ్యామల రావు. వివిధ విభాగాలకు చెందిన 36 మంది అధికారులు, 267 మంది ఉద్యోగులు, ఎస్వీబీసీలో 7 మంది సిబ్బందికి 5 గ్రాముల శ్రీవారి వెండి డాలర్ తో పాటు ప్రశంసా పత్రం అందజేశారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన శ్రీవారి భక్తుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం అందజేశామని చెప్పారు.