ప్రజల కోసం ప్రశ్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తట్టుకోలేక పోతోందని మండి పడ్డారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. జనగామ జిల్లా ఎర్రగుంట తాండాలో మాజీ సర్పంచ్ తో పాటు 8 మంది వార్డు సభ్యులపై పోలీసులు లాఠీఛార్జి చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కూడా అరెస్ట్ చేశారని, అయినా బెదిరే ప్రసక్తి లేదన్నారు. ఇచ్చిన హామీలు అమలయ్యేంత వరకు పోరాడుతూనే ఉంటామని హెచ్చరించారు ఎమ్మెల్యే.