అనకాపల్లి జిల్లా బుచ్చియ్యపేట మండలం పొట్టిదొరపాలెం గ్రామం కొత్తూరు ఎంపీపీ స్కూల్లో 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. వి ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ వి.సత్యారావు , స్కూల్ చైర్మన్ రామాల సత్తిబాబు జాతీయ జెండాను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా గణతంత్ర దినోత్సవ విశిష్టత గురించి హెడ్మాస్టర్ పిల్లలకు వివరించారు. ట్రస్టు చైర్మన్ విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు.