ఇబ్బందులున్నా పథకాల అమలు చేస్తున్నాం
NEWS Jan 26,2025 05:13 pm
కామారెడ్డి: ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పథకాలను అమలు చేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. మండలంలోని గూడెం గ్రామంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లబ్ధిదారులకు చెక్కులు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ నియోజకవర్గంలో గూడెం గ్రామం నుండి ప్రభుత్వ పథకాలు ప్రారంభించినట్టు చెప్పారు.