కథలాపూర్ మండలం సిరికొండకు చెందిన కనికరపు నర్సయ్య అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు . నిన్న తన భార్యతో గొడవ పడి ఆమెను ఇష్టం వచ్చినట్లు కొట్టగా.. ఆమె తన తల్లిగారింటికి వెళ్లింది. దీంతో మనస్తాపం చెంది క్షణికావేశంలో తన ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. మృతుని తమ్ముడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.